ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తున్నా రెండు రోజుల నుంచి మళ్ళీ ఆ సంఖ్య పెరిగింది. అయితే గడిచిన 24 గంటలలో 84,401 శాంపిల్స్ని పరీక్షించగా 2,886 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు మరో 17 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,565 కి చేరింది.
అయితే ఇందులో ప్రస్తుతం 25,514 మంది చికిత్స పొందుతుండగా 7,88,375 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 3,623 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,676 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 79,46,860 శాంపిల్స్ పరీక్షించారు.