తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిందనుకునేలోపే మళ్ళీ కేసుల సంఖ్య పెరిగింది. గత నాలుగు రోజుల నుంచి రెండు వేలలోపే కేసులు నమోదవుతుండగా తాజాగా నేడు కేసుల సంఖ్య మళ్ళీ రెండు వేలు దాటింది. గడిచిన 24 గంటలలో కేవలం 2,154 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో 8 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,239 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,04,748 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,77,008 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 26,551 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,189 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 54,277 మంది శాంపిల్స్ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 33,46,472 టెస్ట్లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 86.45 శాతం ఉండగా, మరణాల రేటు 0.58% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.