ఏపీలో కరోనా కేసుల సంఖ్య నేడు కాస్త పెరిగింది. గత కొద్ది రోజులుగా వందలోపే పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, ఈ రోజౌ వందకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటలలో 37,041 శాంపిల్స్ని పరీక్షించగా కేవలం 118 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు ఒకరు మృతి చెందలేదు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,799 కి చేరింది.
అయితే ఇందులో ప్రస్తుతం 667 మంది చికిత్స పొందుతుండగా 8,81,963 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 86 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,169 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,39,15,009 శాంపిల్స్ పరీక్షించారు.