భారత్లో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తున్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. రోజుకు వెయ్యికి పైగానే మరణాల సంఖ్య నమోదవుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 81,484 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 1,095 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 63,94,068 కి చేరింది.
అయితే ప్రస్తుతం అందులో 9,42,217 యాక్టివ్ కేసులు ఉండగా, 53,52,078 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 99,773 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 78,877 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,97,947 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 83.5 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.