వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారు. 43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి, 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ గారిని విజన్ ఉన్న నాయకుడు అంటారా అని ప్రశ్నించారు. పోలవరం యాత్రకు ధనం వృధా చేసి ఉంటే మీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా?పోలవరం అనేది 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కల. 70 శాతం చంద్రబాబు గారు పూర్తి చేసారు కాబట్టి, కల సాకారం అవుతున్న దృశ్యాన్ని ప్రజలకు చూపించారని అన్నారు.
ఇక మీలాగా ఢిల్లీ వాళ్లకు ‘ఫుట్ మసాజ్’ చేయకుండా, రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో పోరాడారని, ఖర్చుల్లో తేడా ఉంటే, ఏమి పీక్కుంటావో పీక్కో స్కూల్ పిల్లలు వేసుకునే బెల్ట్ కి, సాక్స్ కి వైసీపీ రంగులు వేసుకునే నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్నావా అంటూ నిల్దీశారు. అన్నట్టు 4 వేల కోట్లతో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారా మర్చిపోయావా అని, తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు, నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు, సీబీఐ కోర్టుకు వెళ్లడానికి ప్రతీ వారం 60 లక్షలు, మీ కక్షలు తీర్చుకోవటానికి లాయర్ల ఫీజులంటూ వందల కోట్లు, మీ అవినీతి పత్రికకు వందల కోట్లు, మీరు చేసే వేల కోట్ల దందాలు, మొత్తం లెక్క తీస్తే, 10 పోలవరం ప్రాజెక్ట్లు కట్టవచ్చని అన్నారు.
43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి,16 నెలలు చిప్పకూడు తిన్న @ysjagan గారిని విజన్ ఉన్న నాయకుడు అంటారా @VSReddy_MP ?పోలవరం యాత్రకు ధనం వృధా చేసి ఉంటే మీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా?పోలవరం అనేది 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కల.70 శాతం @ncbn గారు పూర్తి చేసారు కాబట్టి,
(1/4)— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) October 10, 2020
సాక్స్ కి @YSRCParty వరంగులు వేసుకునే నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్నావా?అన్నట్టు 4 వేల కోట్ల తో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారా మర్చిపోయావా?తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు,నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు, (3/4)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) October 10, 2020